Dasara in Rajahmundry: “దేవీచౌక్” ఉత్సవాలకు సర్వం సిద్దం

దసరా ఉత్సవాలకు గోదావరి తీరంలోని ప్రధాన కేంద్రం దేవీచౌక్ ను  భారీ సెట్టింగులతో ముస్తాబు చేశారు. దేవీచౌక్ ని  ఆనుకుని ‘అయిదు మార్గాల్లో పందిళ్లు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు. అమ్మవారి ఉత్సవమూర్తి ప్రతిష్టాపనకు దేవీచౌక్ ఎదురుగా ప్రత్యేకంగా వేదికను రూపొందించారు. శ్రీదేవి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీదేవి కల్యాణ మండపం నుంచి సమితి సభ్యులు అమ్మవారి ఉత్సవమూర్తిని మేళతాళాలతో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొస్తారు. ఆలయ ప్రధానార్చకుడు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అమ్మవారిని ప్రతిష్టాపన చేసి హారతి అందిస్తారు. అమ్మవారి ప్రతిష్టాపన అనంతరం దేవీచౌక్లో విద్యుద్దీపాలను ప్రారంభిస్తారు.

Rate this post