• Recent News

    • రాజమహేంద్రి: మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు సీతా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆది వారం పలువురు పార్టీలో చేరగా వారికి అర్బన్ నియోజకవర్గ వైకాపా అభ్యర్ధి భరత్లామ్ వైకాసా కండువాలు కప్పి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు తనపై లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల ఫలితమేమీ ఉండదన్నారు. అభివృద్ధి పనుల్లో తాను కమీషన్లు తీసుకున్నట్లు రుజువు చేస్తే దేని కైనా సిద్ధమన్నారు. కమీషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుం బానిదేనని, అదే దృష్టితో తనపై బురదజల్లుతున్నారన్నారు.

    • సోమాలమ్మ

      Yearly Jathama Utsavas of Patha Somalamma (Old Somalamma) Temple, Syamala Nagar are to be held from 20 to 24 March 2024. Huge Arrangements are being done on the occasion as Goddess Somalamma is said to be the Nagara Devatha (Goddess of Rajahmundry). Thousand of people are expected to visit Old Somalamma Temple Daily during the Festival. Lighting and Painting Activities are going on across the Street. Panchamruthabhishekam, Visesha Alankarana will be done on 20 March, Ekadasi at 4 AM. Later at 10,08 AM Kalasa Sthapana, 10. 30AM – Ganapathi homam and 6PM – Venkateswara Ganamrutham and Lalitha Sahasra Parayana will took place.. Here are the Daily Programs at Old Somalamma Temple.   20 March: 4 AM – అమ్మవారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం, విశేష అలంక రణ 10.08 AM – కలశ స్థాపన 10.30 AM – గణపతి హోమం 6 PM – వేంకటేశ్వర గానామృతం, లలితా సహస్రనామ పారాయణ 21 March: 8.30 AM – లక్ష పుష్పార్చన 7 AM – అమ్మవారి పల్లకీ సేవ, ఊయల ఉత్సవం, కోలాటం, సాయిబాబా భజన 22 March: 7 AM – చండీ హోమం 6 PM – సహస్ర జ్యోతిర్లింగార్చన, కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు 23 March: 8 AM – సౌభాగ్య వ్రతం 6 PM – సంగీతం, నృత్య ప్రదర్శన, 24 March: 4 AM – పంచామృతాభిషేకం 4 PM – మేళతాశాలు, గరగ నృత్యాలు, బాణసంచాతో అమ్మవారి జాతర ఊరేగింపు ఉత్సవ దినాలలో ప్రతీరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారికి కుంకుమ పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.  

    • Months of tension on Rajahmundry Rural Assembly Seat has been finally closed. Buchaiah Chowdary of TDP finally secured what he wanted. Kandula Durgesh’s Years of waiting for the MLA Seat has been vanished. Janasena has officially announced today that Kandula Durgesh has been given the Nidadavole MLA ticket. The efforts of Butchaiah have succeeded as he managed to keep the Rajahmundry Rural ticket with him while Kandula Durgesh, who was initially gutted by the sacrifice has been pacified by the Janasena high command and has been relocated to Nidadavole. We could see more such cases in both the parties as the seat distribution discussions continue.  

    • తూర్పుగోదావరి జిల్లాలో నేటి నుండి అధిక శబ్దాలతో ధ్వని కాలుష్యం సృష్టిస్తున్న ద్విచక్ర వాహనాలు నడిపే వారిపై చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్టు రాజమండ్రి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.. డిజిటల్ నాయిస్ లెవెల్ మీటర్ ద్వారా చెక్ చేసి 80 డేసిబుల్స్ పైన శబ్దం కలిగించే వాహనాలపై మోటార్ వాహన చట్టం U/S 190 (2) ప్రకారం జరిమానా విధిస్తున్నారు. ఈ రోజు స్పెషల్ డ్రైవ్ లో శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 20 బుల్లెట్ మోటార్ సైకిళ్లను గుర్తించి వాటి సైలెన్సర్లను వాహనదారుల ద్వారా తీయించి నట్టు ట్రాఫిక్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.. ఇక పై ప్రతిరోజు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని.. అధిక శబ్దం చేసే సైలెన్సర్స్ ను బుల్లెట్ మోటార్ సైకిల్ కు అమర్చరాదని వార్నింగ్‌ ఇచ్చారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ లను బిగించే మోటార్ సైకిల్ మెకానిక్ షాపుల వారిపై కూడా చర్యలు తీసుకుంటామని.. మోటారు వాహనాల చట్టం ఉల్లంఘించిన వారిపై కేసును నమోదు చేస్తామని హెచ్చరించారు రాజమండ్రి ట్రాఫిక్ డీఎస్పీ వెంకటేశ్వర్లు.

    • head post office

      ఈనెల 20వ తేదీన రాజమండ్రిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామని డివిజనల్ సూపరింటెండెంట్ పి. కోమల్ కుమార్ శనివారం తెలిపారు. ఇందులో చారిత్రక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సంగీత, క్రీడలు, వన్యప్రాణులు, పక్షి జాతులకు సంబంధించిన విలువైన ఫిలాటలీ స్టాంపులను, ప్రత్యేక సందర్భాల్లో విడుదల చేసిన తపాలా కవర్లను విక్రయిస్తామన్నారు.

    • venkayya naidu

      రాజమండ్రి జే. ఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి సెంటినరీ జూనియర్ కళాశాల అర్ధ శతాబ్ది ఉత్సవం ఈనెల 22న జరుగుతుందని కళాశాల పాలకవర్గం శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు హాజరవుతారన్నారు. కళాశాల అభివృద్ధికి కృషిచేసిన విశ్రాంత అధ్యాపకులు, పూర్వపాలకవర్గ సభ్యులకు సత్కారం, అవధాన కార్యక్రమం ఉంటుందన్నారు.