APSRTC: విజయవాడ- రాజమహేంద్రవరం మధ్య ఏసీ నాన్ స్టాప్ బస్ ప్రారంభం

విజయవాడ: విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి ఈ నెల 26 నుంచి నూతన గరుడ ఏసీ నాన్స్టాప్ సర్వీసును ప్రారంభించినట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజారవాణా అధికారి ఎం. యేసుదానం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నుంచి ఉదయం 3.30, 10:30, మధ్యాహ్నం 1.30. రాత్రి 8.00 గంటలకు, రాజమహేంద్రవరం నుంచి విజయవాడకు ఉదయం 5.30, 8.00, మధ్యాహ్నం 2.15, సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరు తుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ. 420, పిల్లలకు రూ.330గా ఛార్జీ నిర్ణయించామని, ప్రయాణికులు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

5/5 - (1 vote)