AAP Protest: నగరంలో 9 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10, 11వ తేదీలలో రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాజమండ్రి సిటీ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అత్తిలి రాజు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్దగల మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. నగర ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Rate this post