AP State Under-8 Chess Tournament: ప్రతిభ చూపిన రాజమండ్రి చెస్ క్రీడాకారులు

రాజమండ్రికి చెందిన ఇద్దరు చెస్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారని కాల్ ప్యూజిన్ చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాల కుమార్ తెలిపారు. శనివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఏపీ స్టేట్ అండర్-8 చెస్ టోర్నమెంట్లో డి. గౌడ్ రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు, ఎస్. యలపర్తి 9వ ర్యాంకు సాధించారన్నారు. ఈ నెల 9 నుంచి 14 వరకూ విజయవాడలో జరిగే జాతీయ స్థాయి చాంపియన్ షిప్ లో వారు పాల్గొంటారన్నారు.

Rate this post