Power Cut Today: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

వార్షిక మరమ్మతుల కోసం రాజమండ్రి నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ నక్కపల్లి శామ్యూల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని లలితా నగర్, క్వారీ ఫీడర్ పరిధిలోని శ్రీరామ్ నగర్, రాజీవ్ గాంధీ కాలేజీ, రాజీవ్ గాంధీ నగర్, లూథర్ గిరి, మున్సిపల్ కాలనీ, దుర్గ నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. కాగా విద్యుత్ వినియోగదారులు గమనించి అధికారులు సహకరించాలని కోరారు.

Rate this post