Janasena Warning: పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు: జనసేన వీర మహిళలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదంటూ జనసేన వీర మహిళలు హెచ్చరించారు. సోమవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. 2024లో అధికారంలోకి వచ్చేది జనసేన ప్రభుత్వమే అన్న భయంతోనే ఇష్టమొచ్చినట్టుగా మంత్రులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కౌలు రైతులను ఆదుకుంటున్న జనసేన పార్టీ పై విమర్శలు తగదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప, రాష్ట్ర నాయకురాలు ప్రియా సౌజన్య, కాకినాడ మాజీ మేయర్ కవికొండల సరోజ తదితరులు పాల్గొన్నారు.

Rate this post